Share News

వర్షంలోనే ఎప్‌సెట్‌ ధ్రువపత్రాల పరిశీలన

ABN , Publish Date - Jul 02 , 2025 | 11:35 PM

వనపర్తి జిల్లా కేంద్రం లోని కృష్ణదేవరాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఎప్‌ సెట్‌ ధ్రువపత్రాల పరిశీలన వర్షంలోనే కొనసాగింది.

వర్షంలోనే ఎప్‌సెట్‌ ధ్రువపత్రాల పరిశీలన
వర్షంలోనే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన విద్యార్థులు

వనపర్తి విద్యావిభాగం, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా కేంద్రం లోని కృష్ణదేవరాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఎప్‌ సెట్‌ ధ్రువపత్రాల పరిశీలన వర్షంలోనే కొనసాగింది. సీట్ల కేటాయింపునకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలనకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళాశాల సిబ్బంది కుర్చీలు, టెంట్లు తాగునీరు ఏర్పాటు చేయలేదని తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్‌కు మొత్తం 234 మంది విద్యార్థులు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ జగన్‌ తెలిపారు.

Updated Date - Jul 02 , 2025 | 11:35 PM