Share News

ప్రతీ ఒక్కరు భక్తిభావం అలవర్చుకోవాలి

ABN , Publish Date - May 12 , 2025 | 10:59 PM

ప్రతీ ఒక్కరు భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో నడుచుకోవాలని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నియోజకవర్గ నాయకుడు రాజుల ఆశిరెడ్డి అన్నారు.

ప్రతీ ఒక్కరు భక్తిభావం అలవర్చుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరు భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో నడుచుకోవాలని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నియోజకవర్గ నాయకుడు రాజుల ఆశిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని మల్లికా ర్జునస్వామి దేవాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగ, 108 శివాలయాల దర్శన ముగింపు పూజ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ సన్మార్గంలో నడిస్తే జీవితం సార్థకం అవుతుందన్నారు. అ నంతరం ఆలయంలో మల్లికార్జునస్వామి నూతన రథోత్సవం ఏర్పాటు వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నీలమ్మ, తిప్పయ్యస్వామి, మాజీ చైర్‌పర్సన్‌ బాల్చెడ్‌ పావని, మల్లికార్జున్‌, గణేష్‌ కుమార్‌, కల్లూరి గోవర్దన్‌, మిఠాయి రమేష్‌, కావలి బట్టి మహాదేవ్‌, బొంతు రవి, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 10:59 PM