ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి
ABN , Publish Date - May 14 , 2025 | 11:12 PM
జోగుళాంబ గద్వాల జిల్లాలోని నందిన్నె చెక్పోస్టును బుధవారం కలెక్టర్ బీఎం సంతోష్ తనిఖీ చేశారు.
గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల, మే 14 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలోని నందిన్నె చెక్పోస్టును బుధవారం కలెక్టర్ బీఎం సంతోష్ తనిఖీ చేశారు. బార్డర్లోని అన్ని శాఖల అధికారులకు సీరియస్గా ఆదేశాలు జారీచేశారు. తెలంగాణలోకి వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని, వేబిల్లులను పరిశీలించాలని ఆదేశించారు. కొన్ని రోజుల నుంచి కర్ణాటక ధాన్యం తెలంగాణలోని కొనుగోలు కేంద్రాలలోకి వస్తుందని కలెక్టర్ తనిఖీలు చేశారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన చెక్పోస్టుల రికార్డులను పరిశీలించారు. ప్రతీ వాహనం వివరాలు ఉండాలని ఆదేశించారు. అనంతరం నందిన్నెలో ఏర్పాటు చేసి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. తేమ శాతం, గన్నీ బ్యాగులు, లారీల వివరాలను అడిగి తెలసుకున్నారు. హమాలీలను ఎక్కవ సంఖ్యలో ఉంచుకొని త్వరగా కొనుగోలు జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంటన అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీఎస్వో స్వామికుమార్, డీఎం విమల, కేటీదొడ్డి తహసీల్దార్ తదితరులు ఉన్నారు.