Share News

కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

ABN , Publish Date - May 09 , 2025 | 11:21 PM

జూన్‌ 14న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎన్‌. ప్రేమలత పేర్కొన్నారు.

 కేసుల పరిష్కారానికి  కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి ప్రేమలత

జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎన్‌. ప్రేమలత

గద్వాల క్రైం, మే 9 (ఆంధ్రజ్యోతి): జూన్‌ 14న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎన్‌. ప్రేమలత పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహణపై పోలీస్‌ అధికారులతో న్యాయాధికారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కక్షిదారులు పోలీస్‌ స్టేషన్‌లు, కోర్టుల చుట్టూ తిరుగకుండా ఇరువర్గాలకు అవగాహన కల్పించాలన్నారు. రాజీమార్గమే రాజమర్గామని.. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి డబ్బులు, సమయం వృఽథా కాకుండా రాజీ ద్వారా కేసులు పరిష్కరించేందుకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.వీ.హెచ్‌ పూజిత, డీఎస్పీ మొగులయ్య, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 09 , 2025 | 11:21 PM