కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
ABN , Publish Date - May 09 , 2025 | 11:21 PM
జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎన్. ప్రేమలత పేర్కొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎన్. ప్రేమలత
గద్వాల క్రైం, మే 9 (ఆంధ్రజ్యోతి): జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎన్. ప్రేమలత పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై పోలీస్ అధికారులతో న్యాయాధికారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కక్షిదారులు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగకుండా ఇరువర్గాలకు అవగాహన కల్పించాలన్నారు. రాజీమార్గమే రాజమర్గామని.. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి డబ్బులు, సమయం వృఽథా కాకుండా రాజీ ద్వారా కేసులు పరిష్కరించేందుకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్.వీ.హెచ్ పూజిత, డీఎస్పీ మొగులయ్య, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.