త్వరలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి
ABN , Publish Date - May 09 , 2025 | 10:55 PM
మక్త ల్ పట్టణంలో 150 ప డకల ఆసుపత్రి నిర్మా ణ పనులను త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మె ల్యే వాకిటి శ్రీహరి అ న్నారు.

- 150 పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
మక్తల్ రూరల్, మే 9 (ఆంధ్రజ్యోతి): మక్త ల్ పట్టణంలో 150 ప డకల ఆసుపత్రి నిర్మా ణ పనులను త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మె ల్యే వాకిటి శ్రీహరి అ న్నారు. శుక్రవారం మ క్తల్ పట్టణ శివారులోని పంపుహౌస్ వద్ద జరుగుతున్న ఆసుపత్రి నిర్మాణ పనులను ఆ యన ఏఈ సాయి, కాంట్రాక్టర్ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన భవన నిర్మాణ నమూనాను పరిశీలించి, నిర్మాణ పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయి వంటి వివరాలను అధికారులనడిగి తెలుసుకున్నారు. పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్, డైరెక్టర్లు పసుల రంజిత్రెడ్డి, సాలంబిన్ ఉమర్ బస్రవి, అంజి, కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్కుమార్, కోళ్ల వెంకటేష్, బోయ రవికుమార్, కావలి తాయప్ప, బోయ వెంకటేష్, కట్ట వెంకటేశ్, సీఎన్ మూర్తి, వాకిటి శ్యామ్ తదితరులున్నారు.