మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు అభినందనలు
ABN , Publish Date - May 25 , 2025 | 11:06 PM
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ స్టేట్ చైర్పర్స న్గా నియమితులైన మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణను గద్వాల బీజేపీ నాయకులు అభినందించారు.
గద్వాల టౌన్, మే 25 (ఆంధ్రజ్యోతి): ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ స్టేట్ చైర్పర్స న్గా నియమితులైన మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణను గద్వాల బీజేపీ నాయకులు అభినందించారు. ఆదివారం మహబూబ్నగర్ లోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో డీకే అరు ణను కలిసిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట్రాములు, మాజీ కౌన్సిలర్ టి.త్యాగరాజు, ఆర్ఆర్ శ్రీనివాస్, ఎస్వీఎం విద్యాసంస్థల చైర్మన్ నారాయణగౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.