స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:21 PM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యక ర్తలు, బూత్స్థాయి బాధ్యులు సిద్ధంగా ఉండా లని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంప త్కుమార్ అన్నారు.
ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
వడ్డేపల్లి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యక ర్తలు, బూత్స్థాయి బాధ్యులు సిద్ధంగా ఉండా లని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంప త్కుమార్ అన్నారు. అదే సమయంలో నాయ కులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమ స్యలను తెలుసుకుని చేపట్టేబోయే కార్యాచరణ గురించి వివరించాలని శ్రేణులకు సూచించారు. బుధవారం శాంతినగర్లోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో అలంపూర్ నియోజక వర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావే శం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ విశ్వనాథ్, రాష్ట్ర క్రిస్టి యన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్జాన్, వెంకటేశ్ హాజరయ్యారు. ఈసందర్భంగా సంప త్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గ్రా మాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా రు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతు న్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్య త నాయకులు, కార్యకర్తలదేనన్నారు. అలంపూ ర్ నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, కార్య కర్తలందరూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కా ర్యక్రమాలను, అభివృద్ధిని వివరిస్తూ పనిచేయా లని శ్రేణులకు సూచించారు. ఏఐసీసీ కార్యద ర్శి విశ్వనాథ్ మాట్లాడుతూ సంపత్కుమార్ అలంపూర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కోసం నిరంతరం తపించే నాయకుడ ని అన్నారు. సమావేశంలో పార్టీ పరిశీలకులు దీపక్జాన్, వెంకటేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్, ఆర్టీఏ కమిషన్ మెంబర్ పల్లీ సతీష్రెడ్డి, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారా మిరెడ్డి, కిసాన్సెల్ అద్యక్షుడు కొంకల నాగరా జు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నాగశిరోమణి, మండలాల అధ్యక్షులు, పదాధికా రులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.