Share News

కానిస్టేబుల్‌పై అట్రాసిటీ కేసు నమోదు

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:36 PM

శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో విదులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ రఘునాథ్‌గౌడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అ ట్రాసిటీ కేసు నమోదు చేశామని ఎస్‌ఐ చెప్పారు.

కానిస్టేబుల్‌పై అట్రాసిటీ కేసు నమోదు

గట్టు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో విదులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ రఘునాథ్‌గౌడు, తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఖమ్మం జి ల్లా పాల్వాంచకు చెందిన యువతి ఫిర్యాదు చేసిందని ఎస్‌ఐ కేటీ మల్లేశ్‌ తెలిపారు. ఆ ఫిర్యాదు మేరకు రఘునాథ్‌గౌడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అ ట్రాసిటీ కేసు నమోదు చేశామని ఎస్‌ఐ చెప్పారు. కాగా కానిస్టేబుల్‌ స్వగ్రామం మండల పరిధిలోని చిన్నోనిపల్లి అని చెప్పారు. యువతి ప్రియాంక వారం రోజులుగా జిల్లా పోలీసులను ఆశ్రయిస్తున్న విష యం తెలిసిందే.

Updated Date - Jul 24 , 2025 | 11:36 PM