ప్రియాంక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:30 PM
గద్వాల ని యోజకవర్గంలోని మల్దకల్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని ప్రియాంక ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బుధవారం మహబూబ్నగర్ ఎస్పీ, కలెక్టర్లను కోరారు.
మహబూబ్నగర్ ఎస్పీ, కలెక్టర్ను కోరిన ఎమ్మెల్యే
గద్వాల న్యూటౌన్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : గద్వాల ని యోజకవర్గంలోని మల్దకల్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని ప్రియాంక ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బుధవారం మహబూబ్నగర్ ఎస్పీ, కలెక్టర్లను కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రియాంక మృతి చాలా బాధాకరమని, ఆమె మృతి తల్లిదం డ్రులకు కడుపుకోత మిగిల్చిందన్నారు. ఇందుకు సంబంధించి పూ ర్తి వివరాలను తెలుసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చే యాలన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ విజయ్, మాజీ వై స్ ఎంపీపీ వీరన్న, నాయకులు అజయ్, వెంకటన్న ఉన్నారు.