Share News

విద్యాభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలి

ABN , Publish Date - May 10 , 2025 | 12:05 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి మం డలాల విద్యాధికారులు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్‌ మాస్టర్లు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి సహకరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్‌ ఘని అన్నారు.

విద్యాభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలి

డీఈవో అబ్దుల్‌ ఘని

గద్వాల టౌన్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి మం డలాల విద్యాధికారులు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్‌ మాస్టర్లు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి సహకరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్‌ ఘని అన్నారు. అదే సమయంలో రాష్ట్ర అధి కారులు సూచించిన విధంగా అన్నికార్యక్రమా ల్లో ఉపాధ్యాయులను విధిగా మార్గదర్శనం చే యాలన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలభవ న్‌లో మండల విద్యాధికారుల విద్యా సంవత్స రం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యాసంవ త్సరంలో చేపట్టిన బడిబాట, యూడైస్‌, మా ర్కుల ఆప్‌లోడింగ్‌, శిక్షణ కార్యక్రమాలు, కాంప్లె క్స్‌ సమావేశాలను పకడ్బందీగా నిర్వహించాల న్నారు. ఈఏడాది పదవ తరగతిలో ఉత్తమ ఫ లితాలు వచ్చేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది కూడా మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ఇప్పటినుంచి కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా సీఆర్‌పీలు, ఎం ఐఎస్‌, కోఆర్డినేటర్లు, సీసీవోలు డేటా నమోదు చేయడంలో చురుగ్గా వ్యవహరించాలన్నారు. సమావేశంలో సెక్టోరియల్‌ అధికారులు ఎస్తేరు రాణి, ఫర్జానా బేగం, డీసీఈబీ సెక్రటరీ ప్రతా ప్‌రెడ్డి, అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసులు, అన్ని మండలాల విద్యాధికారులు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లు, సీఆర్పీలు, ఎంఐఎస్‌లు, సీసీవో లు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:05 AM