Share News

వనపర్తి జిల్లాకు 39 మంది నూతన జూనియర్‌ లెక్చరర్లు

ABN , Publish Date - Mar 14 , 2025 | 11:24 PM

జిల్లాలోని 12 ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లకు, 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు 39 మంది నూతన జూనియర్‌ లెక్చరర్లను ఎంపిక చేశారని డీఐఈవో అంజయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

వనపర్తి జిల్లాకు 39 మంది నూతన జూనియర్‌ లెక్చరర్లు

వనపర్తి రూరల్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని 12 ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లకు, 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు 39 మంది నూతన జూనియర్‌ లెక్చరర్లను ఎంపిక చేశారని డీఐఈవో అంజయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కెమిస్ర్టీ 7, ఇం గ్లిష్‌ 6, బాటని 5, హిస్టరీ 5, జువాలజీ 4, ఫి జిక్స్‌ 3, మ్యాథ్స్‌ 2, తెలుగు 2, హిందీ 2, ఎక నామిక్స్‌ 2, కామర్స్‌ 1 ఉన్నాయి. వివిధ కళాశా లల్లో 25 మంది నూతన జూనియర్‌ లెక్చరర్లు విధుల్లో చేరారని, మిగిలిన 14 మంది మూడు రోజుల్లో విధుల్లో చేరనున్నట్లు చెప్పారు.

Updated Date - Mar 14 , 2025 | 11:24 PM