తండాలకు మహర్దశ
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:10 PM
ప్రజాపాలన ప్రభుత్వంలో గిరిజన తండాల అభి వృద్ధికి పెద్దపీట వేయడంతో మహర్దశ వచ్చిం దని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్రెడ్డి అ న్నారు.

- ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి
బిజినేపల్లి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలన ప్రభుత్వంలో గిరిజన తండాల అభి వృద్ధికి పెద్దపీట వేయడంతో మహర్దశ వచ్చిం దని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్రెడ్డి అ న్నారు. మండలంలోని ఊడుగులకుంట తండా నుంచి మంగనూర్ వరకు షెడ్యూల్డ్ తెగల ఎస్డీఎఫ్ నిధులు రూ.3.73 కోట్ల నిధులతో బీటీ రోడ్డు పనులకు బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రతీ ఆవాసానికి బీటీ రోడ్డు వేసి రవాణా అవస్థలు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీ గెలిపించి ముఖ్యమంత్రికి బహుమతి ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెం ట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మిద్దె రాము లు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ వెంకటస్వామి, మాజీ సర్పంచులు అమృత్రెడ్డి, తిరుపతయ్య, కాట్రావత్ చందులాల్, పాండు నాయక్, హరీ శ్వర్రెడ్డి, చంద్రగౌడ్, మాన్యనాయక్, రాంచం దర్, మోహన్రెడ్డి, మల్లేష్ యాదవ్, బాలపీరు, నగేష్, కత్తె ఈశ్వర్, వాల్యనాయక్, గోవింద్ నా యక్, శ్రీనివాస్ రెడ్డి, పూల్యానాయక్, కృష్ణానా యక్, వెంకటస్వామి, సైదులు, లక్ష్మయ్య గౌడ్, తిరుపతి రెడ్డి ఉన్నారు.
తండాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం
తిమ్మాజిపేట : కాంగ్రెస్ ప్రభుత్వంలో తండాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నదని స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. మండలం లోని బుద్ద నాయకతండాకు రూ.76లక్షల 50వేలతో మం జూరైన రోడ్డుకు భూమి పూ జచేశారు. లక్ష్మీనాయక్ తం డా నుంచి తువ్వబండ తం డా, గొరిట తండా నుంచి ఎర్రబిక్యతండాకు 70లక్షలు మంజూరు కాగా పుల్లగిరి రోడ్డు నుంచి బోరుగడ్డతం డాకు 43లక్షల 50వేలు అదే విధంగా చెన్నాగులతండా కు 42లక్షల 50వేలు మంజూరు కాగా ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేసి మాట్లాడా రు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్బహు దూర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాధవులు, నాయకులు దానం బాలరాజు, రవూఫ్, హర్షవర్ధ న్రెడ్డి, లక్ష్మీనారా యణ, నాగసాయిలు, ముబా రక్, వెంకటయ్య, అనంతాచారి, మల్లేష్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.