పసుపు రైతులకు న్యాయమైన ధర అందటం లేదు
ABN , Publish Date - May 17 , 2025 | 04:22 AM
కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసినా రైతులకు న్యాయమైన ధర అందడం లేదని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేసినా లాభం లేదు: కోదండరెడ్డి
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసినా రైతులకు న్యాయమైన ధర అందడం లేదని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర సాంగ్లి, కేరళలోని ఎరోడ్ మార్కెట్లలో ధర ఎక్కువగా వస్తున్నదని, తెలంగాణలో మాత్రం తక్కువగా ఉందన్నారు.
రైతులకు కురుకుమిన్ శాతం ఎక్కువగా ఉండే విత్తనాలు అందించాలని రాష్ట్ర ఉద్యాన శాఖకు సూచించినట్లు తెలిపారు. పసుపు సాగులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఆధునిక యంత్రాలు అందించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని సూచించారు.