Share News

మహిళలు శుక్రవారం సభకు హాజరు కావాలి..

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:27 AM

ప్రతి మహిళ, గర్భిణి, బాలింత శుక్రవారం సభకు తప్పని సరిగా హాజరు కావాలని అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే అన్నారు

మహిళలు శుక్రవారం సభకు హాజరు కావాలి..
శుక్రవారం సభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజి వాకడే

భగత్‌నగర్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రతి మహిళ, గర్భిణి, బాలింత శుక్రవారం సభకు తప్పని సరిగా హాజరు కావాలని అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే అన్నారు. శుక్రవారం కొత్తపల్లి సెక్టార్‌, రాజీవ్‌ గృహకల్ప అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఏమైనా సమస్యలుంటే సభలో తెలపాలన్నారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలకు 50 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. ఉచిత పరీక్షలను ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్షలు అందుబాటులో ఉన్నాయ న్నారు. ఈ సందర్భంగా శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో సరస్వతి, సీడీపీవో సబిత, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ అరుణ సతీష్‌, రాజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:27 AM