Share News

మాస్టర్‌ ప్లాన్‌ పకడ్బందీగా అమలు చేయాలి

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:22 AM

సిరిసిల్ల మున్సిపాలిటీ మాస్టర్‌ ప్లాన్‌ పక డ్బందీగా అమలుచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు.

మాస్టర్‌ ప్లాన్‌ పకడ్బందీగా అమలు చేయాలి

సిరిసిల్ల, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల మున్సిపాలిటీ మాస్టర్‌ ప్లాన్‌ పక డ్బందీగా అమలుచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో అమృత్‌ 2.0 పథకం కింద సిరిసిల్ల మున్సిపాలిటీలో మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు మొదటి కన్సల్టే టివ్‌ వర్క్‌షాప్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరి మా అగర్వాల్‌ మాట్లాడుతూ జీఐఎస్‌ సాంకేతికత ఆధారంగా బేస్‌ మ్యాప్స్‌, ల్యాం డ్‌యూజ్‌ మ్యాప్‌, మాస్టర్‌ప్లాన్‌లు, అర్బన్‌ జియో-పోర్టల్‌ సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఇప్పటికే సర్వే ఆఫ్‌ ఇండియా వారి ఆధ్వర్యంలో డ్రోన్‌ సర్వే పూర్తిచేయడంతో పాటు, సోషియో ఎకనామిక్‌ సర్వే నిర్వ హించినట్లు వెల్లడించారు. జిల్లాలో వివిధ శాఖల అధికారులు సంబంధిత వివ రాలు మొత్తం అందజేయాలని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఆయా శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులకు చేసిన ప్రణాళికల వివరాలు అందించాలన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ అమలుతో మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీలు, రోడ్లు, విద్యుత్‌వంటి మౌలిక సదుపా యాలు మెరుగుపడతాయని వివరించారు. వారం రోజుల్లోగా వివిధ శాఖల జిల్లా అధికారులు సంబంధిత డేటా, ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల వివరాలు అందజేయాలని సూచించారు. మాస్టర్‌ ప్లాన్‌ అమ లులో సంబంధిత అధికారులందరూ భాగస్వామ్యమవ్వాలని పేర్కొన్నారు. సమా వేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జీఐఎస్‌ హబ్‌ డీటీసీపీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అశ్వినీయాదవ్‌, డీటీసీపీవో వరంగల్‌ ఏడీ జ్యోతి, సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పాషా, డీటీసీపీవో అన్సారి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 12:22 AM