జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలపాలి
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:13 AM
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు విజయవంతంగా అమలు చేస్తూ.. జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలి పేలా పని చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు.
సిరిసిల్ల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు విజయవంతంగా అమలు చేస్తూ.. జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలి పేలా పని చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. గురువారం ఇన్చార్జి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహంచారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ లక్ష్యా లు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెసిడెన్షియల్, అన్ని విద్యాలయాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. ప్రతి సోమ వారం నిర్వహించే ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు సమయానికి హాజరుకా వాలని ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నగేష్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.