రైతులకు టార్పాలిన్లు అందజేయాలి
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:35 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు లకు కచ్చితంగా టార్పాలిస్లు అందజేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు.
తంగళ్లపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు లకు కచ్చితంగా టార్పాలిస్లు అందజేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. గురువారం తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్చార్జికలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు, వడ్ల తేమ శాతం పరిశీ లించి, రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో రైతులు వరి కోతలు మరో రెండు రోజులు వాయిదా వేసుకో వాలని కోరారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ధాన్యం ఆరబెట్టాలని సూచించా రు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్మిల్లర్లు అన్లోడ్ చేసుకునేలా చూడాలని, సన్నరకం వడ్లను కూడా తీసుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఫౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి అఫ్జల్ బేగం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రశాశ్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.