విద్యార్థులకు వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:31 AM
విద్యార్థులకు వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంజేపీ గురుకులాల జాయింట్ సెక్రటరీ శ్యాంప్రసాద్లాల్ సిబ్బందికి సూచించారు. హుజూరాబాద్ పట్టణం కేసీ క్యాంపులోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల హాస్టల్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు.
హుజూరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంజేపీ గురుకులాల జాయింట్ సెక్రటరీ శ్యాంప్రసాద్లాల్ సిబ్బందికి సూచించారు. హుజూరాబాద్ పట్టణం కేసీ క్యాంపులోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల హాస్టల్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని రికార్డులను పరిశీలించారు. పాఠశాలలోని పదో తరగతి చదివే విద్యార్థునుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తాళ్లపల్లి శారద, సిబ్బంది పాల్గొన్నారు.