ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:32 AM
ఎరువులు, పురుగు మం దుల దుకాణాల నిర్వాహకులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు.
కోనరావుపేట, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఎరువులు, పురుగు మం దుల దుకాణాల నిర్వాహకులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. కోనరావుపేట మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరు వుల దుకాణం, గౌరీ శంకర్ ఫెర్టిలైజర్, ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘం లిమిటెడ్ సెంటర్లు, గోదాముల్లో మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల అవసరా లకు అనుగుణంగా యూరియా బస్తాలను తెప్పించి అందుబా టులో ఉండాలని సూచించారు. రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారో దానికి అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉంచాలని, యూరియా అధిక వాడకం వలన కలిగే నష్టాలను రైతులకు వ్యవసాయ అధికారులు, దుకాణాల నిర్వాహకులు వివరించాలని ఆదేశించారు. యూరియాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వివరించాలని తెలిపారు. జిల్లాలో యూరియా కొర త లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక వేళ యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిం చారు. స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, సీసీ టీవీ కెమెరాలు లేని గోదాములలో వెంటనే ఏర్పాటు చేయాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు వరలక్ష్మి, సందీప్ తదిత రులు పాల్గొన్నారు.