రెవెన్యూ సదస్సులో 90 దరఖాస్తులు
ABN , Publish Date - May 10 , 2025 | 12:29 AM
మండలంలోని వెన్కేపల్లి, రాంచద్రాపూర్ గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 90 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్ తెలిపారు. వెన్కేపల్లి లో 67, రాంచంద్రాపూర్ గ్రామంలో 23 దరఖాస్తులు వచ్చాయన్నారు.

సైదాపూర్, మే 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెన్కేపల్లి, రాంచద్రాపూర్ గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 90 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్ తెలిపారు. వెన్కేపల్లి లో 67, రాంచంద్రాపూర్ గ్రామంలో 23 దరఖాస్తులు వచ్చాయన్నారు. రైతులు ఇచ్చిన దరఖాస్తులు ఎప్పటికప్పుడు అన్లైన్ చేస్తున్నామన్నారు. భూభారతి చట్టం నిబంధనల ప్రకారం సమస్యలు పరిష్కారిస్తామన్నారు. ఎప్పటికప్పుడు వచ్చిన దరఖస్తులు పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో దుద్దెనపల్లి, బొమ్మకల్ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు ఉంటాయని తెలిపారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కనకయ్య, డీటీలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.