నిబంధనల ప్రకారం రికార్డులను నిర్వహించాలి
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:36 AM
అలా్ట్రసౌండ్ పరీక్షలు చేసే ఆసుపత్రులు నిబంధనల ప్రకారం రికార్డులను నిర్వహించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సుభాష్నగర్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అలా్ట్రసౌండ్ పరీక్షలు చేసే ఆసుపత్రులు నిబంధనల ప్రకారం రికార్డులను నిర్వహించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం నగరంలోని ఐదు అలా్ట్రసౌండ్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగనిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, ప్రోత్సహించిన, సహకరించిన వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 50 వేల రూపాయల జరిమానా విధిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా జనరల్ ఆసుపత్రిలోని వెల్నెస్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ సేవలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించారు. అక్కడికి వచ్చిన పెన్షనర్లతో మాట్లాడి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంసీహెచ్పీవో డాక్టర్ సనా జవేరియా, ఎన్హెచ్ఎం డీపీవో స్వామి, సూపర్వైజర్ సాబీర్, రమేశ్ పాల్గొన్నారు.