ప్రజావాణి సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:17 AM
ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ ఆదేశించారు.
సుభాష్నగర్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దరఖాస్తులను పరిశీలించి సాఽధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. 379 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.