Share News

పేద మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలి

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:11 AM

జిల్లాలోని ప్రతి పేద మహిళ స్వయం సహాయక సంఘాలో సభ్యురాలిగా ఉండాలని సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ ఆదేశించారు.

పేద మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలి

సిరిసిల్ల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి పేద మహిళ స్వయం సహాయక సంఘాలో సభ్యురాలిగా ఉండాలని సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ లో సెర్ప్‌ డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలతో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌లుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. గుప్పెడు బియ్యం-గుప్పెడు పప్పు కార్యక్రమంలో పలువురికి పోష కాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెర్ప్‌ సీఈవో మాట్లా డుతూ సెర్ప్‌ ప్రతిజ్ఞ ప్రకారం అందుకున్న విజయాన్ని అందరికీ పంచుదాము అనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కింద పేద మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలనేదే లక్ష్యమని అన్నారు. ప్రతి గ్రామంలోని మహిళలు స్వయంసహాయక సంఘాల్లో చేర్పిం చాలని, వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ఆర్థికంగా ఎది గేలా మద్దతు ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఎస్‌హెచ్‌ జీలకు భవనాలు ఉండాలని, సభ్యులందరూ అక్షరాభ్యాసం పూర్తి చేయాలని, వృద్ధ మహిళల, దివ్యాంగుల, కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌, సోలార్‌ పవర్‌ యూనిట్‌, మండలానికి ఒక ఆర్టీసీ బస్సు ఇప్పిం చేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పేద గర్భిణులు, పోషకాహార లోపం ఉన్న పిల్లలను దత్తత తీసుకుని వారికి పోషకాహారం అందించాలని పిలుపునిచ్చారు. ఎస్‌ హెచ్‌జీలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించేలా చూడాలని ఆదే శించారు. దీంతో మిగతా వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రుణాల రికవరీలో జిల్లా రాష్ట్రంలోనే ముందు స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. రానున్న ఉగాదిలోగా జిల్లాలోని మహిళలందరూ కనీసం చదువుకొని తమ బ్యాంకు ఇతర అన్ని కార్యకలాపాలు పూర్తి చేసుకునేలా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రతి పేద మహిళ స్వయంసహాయక సంఘాల్లో సభ్యురాలి గా చేరాలని, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా సంఘాలకు 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేటాయించామని, పేద ఎస్‌హెచ్‌జీ సభ్యు లు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు ఇప్పటిదాకా ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున రూ.10కోట్లు ఇచ్చామని, వీవో భవనాల నిర్మాణానికి కృషి చేస్తామని, పెట్రోల్‌ బంక్‌, సోలార్‌ పవర్‌ యూనిట్‌ ఇతర పనులు పూర్తి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) గడ్డం నగేష్‌, డీఆర్‌డీవో శేషాద్రి, అడిషనల్‌ డీఆర్‌డీవో శ్రీని వాస్‌, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 12:11 AM