పోలీసుల విస్తృత తనిఖీలు
ABN , Publish Date - May 10 , 2025 | 12:31 AM
కరీంనగర్ రూరల్ మండలంలోని పలు ప్రాంతాల్లో రూరల్ సీఐ నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ లక్ష్మారెడ్డి, సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు.

కరీంనగర్ క్రైం, మే 9 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ రూరల్ మండలంలోని పలు ప్రాంతాల్లో రూరల్ సీఐ నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ లక్ష్మారెడ్డి, సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మండలంలోని పలు గ్రామాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించామని సీఐ తెలిపారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితులను విచారించారు.