Share News

ఆపరేషన్‌ సిందూర్‌కు మద్దతుగా ప్లకార్డుల ప్రదర్శన

ABN , Publish Date - May 10 , 2025 | 12:26 AM

పాకిస్థాన్‌ ఉగ్రవాదుల పై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత సైన్యం వీరోచితంగా పోరాటం చేయడం హర్షనీయమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షు డు మూషం రమేష్‌ అన్నారు.

ఆపరేషన్‌ సిందూర్‌కు మద్దతుగా ప్లకార్డుల ప్రదర్శన

సిరిసిల్ల రూరల్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌ ఉగ్రవాదుల పై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత సైన్యం వీరోచితంగా పోరాటం చేయడం హర్షనీయమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షు డు మూషం రమేష్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కోత్తబస్టాం డ్‌లో సీఐటీయూ పాలిస్టర్‌ వార్పిన్‌ వర్కర్స్‌ ఆధ్వర్యంలో శుక్రవా రం నాయకులు, కార్మికులు ప్లకార్డులు పట్టుకుని ఆపరేషన్‌ సిం దూర్‌పై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లా డుతూ భారత దేశంలోని కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో హిందువులపై పాకిస్థాన్‌ ఉగ్రవాదులు దాడులు చేసి 26మంది పర్యాటకులను కాల్చిచంపారన్నారు. దానికి ప్రతీ కారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్ధావరాలపై మన సైనికు లు వీరోచితంగా పోరాడి ముట్టబెట్టడం జరిగిందన్నారు. అదే విధంగా పాకిస్థాన్‌ మళ్లీ అలాంటి సంఘటనలు చేయకుండా బుద్ధి చెప్పే విధంగా పెద్దఎత్తున దాడులు నిర్వహించడం హర్ష నీయన్నారు. ఈ కార్యక్రమంలో వార్పిన్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సిరిమల్లె సత్యం, కుమ్మరికుంట కిషన్‌, ఉడుత రవి, ఎలిగేటి రాజశే ఖర్‌, ఐరన్‌ ప్రవీణ్‌, మచ్చవేణు, ప్రసాద్‌, బూట్ల వెంకటేశ్వర్లు తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:26 AM