Share News

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

ABN , Publish Date - May 17 , 2025 | 12:35 AM

గ్రామాల్లో ప్రతి ఒక్కరూ విధిగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రజిత అన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

వీర్నపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రతి ఒక్కరూ విధిగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రజిత అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అవగాహన కార్యక్రమం, సిబ్బందితో ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ నివారణ కోసం నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. ఎలీసా పరీక్ష ద్వారా డెంగ్యూ నిర్ధారణ చేస్తారన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డైడ్రే కార్యక్రమాలను సిబ్బంది నిర్వహిస్తున్నార ని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డాక్టర్‌ అంజలినాఆల్ర్పేడ్‌, మలేరియా అధికారి డాక్టర్‌ అనిత, డాక్టర్‌ రామకృష్ణ, మండల వైద్యాధికారిని సరియా అంజూమ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో రాజ్‌కుమార్‌, హెచ్‌ఈవో లింగం, ఎస్‌యుఓ మోహన్‌, డీ డీఎం కార్తీక్‌, చైతన్య, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 12:35 AM