Peddapalli: తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:11 AM
సుల్తానాబాద్, అక్టో బరు 30 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని వెంటనే కొను గోలు చేయాలని పెద్ద పల్లి మాజీఎమ్మెల్యే, బీఆ ర్ఎస్నాయకుడు దాసరి మనోహర్రెడ్డి డిమాండ్ చేశారు.
-మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
సుల్తానాబాద్, అక్టో బరు 30 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని వెంటనే కొను గోలు చేయాలని పెద్ద పల్లి మాజీఎమ్మెల్యే, బీఆ ర్ఎస్నాయకుడు దాసరి మనోహర్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సుల్తానాబాద్ వ్యవ సాయ మార్కెట్ యార్డు ను ఆయన సందర్శించారు. తడిసిన, కొట్టుకుపోయిన ధాన్యానికి సంబంధిం చిన రైతులను పరామర్శించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభు త్వం ద్వారా తగిన నష్టపరిహారం ఇప్పిం చేలా బీఆర్ఎస్ కృషిచేస్తుందన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లా డుతూ సీఎం రేవంత్రెడ్డి కూడా రైతు బిడ్డనేనని, రైతులకష్టాలు ఏంటో ఆయ నకు బాగా తెలుసన్నారు. తడిసిన ధాన్యాన్ని నిబంధనలు సడలించి తక్ష ణమే కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గర్రెపల్లి,సుద్దాల సింగిల్ విండోచైర్మన్ జూపల్లి సందీప్ రావు, గడ్డంమహిపాల్రెడ్డి, మాజీఎంపీపీ పాల రామారావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజమల్లయ్య, తాళ్లపల్లి మనోజ్ గౌడ్, గొట్టం మహేష్, ఓదెల దేవస్థానం మాజీ డైరెక్టర్ కర్రెకుమారస్వామి, మత్స్య శాఖ జిల్లా మాజీడైరెక్టర్ గరిగంటి కుమార్ బాబు, తదితరులు పాల్గొన్నారు.