Share News

ప్రైవేట్‌ స్కూళ్లను తనిఖీలు చేయని అధికారులు

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:40 AM

ప్రైవేట్‌ స్కూళ్లను తనిఖీ చేయడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి విమర్శించారు.

ప్రైవేట్‌ స్కూళ్లను తనిఖీలు చేయని అధికారులు

భగత్‌నగర్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ స్కూళ్లను తనిఖీ చేయడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి విమర్శించారు. ఆదివారం నగరంలోని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా ఐఐటీ, నీట్‌, ఈ టెక్నో, ఒలంపియాడ్‌ ఇలా పేర్లు పెట్టుకున్న విద్యాసంస్థలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలు యూనిఫామ్స్‌, అడ్మిషన్‌ , బుక్స్‌, టై, బెల్టులు, షూస్‌లు, హాస్టల్‌ ఫీజుల పేరుతో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విమర్శించారు. జిల్లా అధికారులు స్పందించి పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు అభిరామ్‌, రాకేష్‌, సంపత్‌, నిశాంత్‌రెడ్డి, రాహుల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:40 AM