Share News

తడి, పొడి చెత్తను వేరు చేయాలి

ABN , Publish Date - May 10 , 2025 | 12:26 AM

ప్రతిరోజు తడి పొడి చెత్తను వేరు చేసి డంపు యార్డుకు చెత్తను తగ్గించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. నగరంలోని మల్కాపూర్‌, లక్ష్మీపూర్‌, కొత్తపల్లిలో కమిషనర్‌ శుక్రవారం పర్యటించారు. మల్కాపూర్‌, కొత్తపల్లిలో గతంలో వినియోగించిన డంపు యార్డులను, డీఆర్‌సీసీ సెంటర్‌, వర్మికంపోస్టు పిట్స్‌ను పరిశీలించారు.

తడి, పొడి చెత్తను వేరు చేయాలి
అధికారులకు సూచనలు చేస్తున్న కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ప్రతిరోజు తడి పొడి చెత్తను వేరు చేసి డంపు యార్డుకు చెత్తను తగ్గించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. నగరంలోని మల్కాపూర్‌, లక్ష్మీపూర్‌, కొత్తపల్లిలో కమిషనర్‌ శుక్రవారం పర్యటించారు. మల్కాపూర్‌, కొత్తపల్లిలో గతంలో వినియోగించిన డంపు యార్డులను, డీఆర్‌సీసీ సెంటర్‌, వర్మికంపోస్టు పిట్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఇంట్లో ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే చెత్తను ఇంట్లోనే వేరు చేసి బుట్టల ద్వారా నగరపాలక సంస్థ కార్మికులకు అందించాలని సూచించారు. చెత్తను సేకరించి స్వచ్ఛ ఆటోల ద్వారా కొత్తపల్లి, మల్కాపూర్‌ డంపు యార్డు వద్ద పొడి చెత్తలోని డబ్బాలు, అట్టముక్కలు, ఇతర వస్తువులను డీఆర్‌సీసీకి తరలించాలన్నారు. తడి చెత్తను స్థానికంగా ఉన్న వర్మికంపోస్టు పిట్స్‌ ద్వారా సేంద్రీయ ఎరువులుగా మార్చాలన్నారు. సెగ్రిగేషన్‌ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి డంపు యార్డుకు వెళ్లే చెత్తను పూర్తిస్థాయిలో తగ్గించాలన్నారు. నగరవ్యాప్తంగా ప్రతి డివిజన్‌లో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించి కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను కార్మికులు తప్పకుండా సేకరించి వంద శాతం సెగ్రిగేషన్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ వేణు మాధవ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:26 AM