Share News

వాహనాలు, హమాలీల కొరత రాకుండా చర్యలు

ABN , Publish Date - May 10 , 2025 | 12:23 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీలు, హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ డి వేణు తెలిపారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘కొనుగోళ్లలో జాప్యం-పేరుకుపోతున్న ధాన్యం’ అనే శీర్షిక కథనం ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు.

వాహనాలు, హమాలీల కొరత రాకుండా చర్యలు
ఓదెల సొసైటీ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ వేణు

- అదనపు కలెక్టర్‌ డి వేణు

- ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

ఓదెల, మే 9 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీలు, హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ డి వేణు తెలిపారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘కొనుగోళ్లలో జాప్యం-పేరుకుపోతున్న ధాన్యం’ అనే శీర్షిక కథనం ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఓదెలలోని ఐకేపీ, పీఏసీఎస్‌ ధాన్య కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ వేణుతో పాటు సివిల్‌ సప్లై డీఎం శ్రీకాంత్‌, డీసీవో శ్రీమాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ వేణు మాట్లాడుతు, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నామన్నారు. ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యం చేయవద్దని, కేంద్రాల్లో హమాలీల సమస్యలు రాకుండా చూసుకోవాలని తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలోని కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు అవసరమైతే టార్పాలిన్‌ కవర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. రైతులకు మద్దతు ధరతో పాటు సన్నరకం ధాన్యానికి ఐదువందల రూపాయల బోనస్‌ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్య కొనుగోలుతో పాటు తూకం, లోడింగ్‌ వేగవంతం చేయాలని కోరారు. అలాగే మండలంలోని ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతోందని తెలిపారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ల సుమన్‌ రెడ్డి, సీసీ విజయ, కేంద్రాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:23 AM