Share News

సొంతింటి కలను సాకారం చేసుకోవాలి

ABN , Publish Date - May 26 , 2025 | 12:46 AM

ప్రభుత్వం అందించే సహాయా న్ని పొంది తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని,ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికి ఒక రూపాయి ఇవ్వడానికి వీలు లేదని, ఎక్కడా పైరవీ చేయాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ సందీ ప్‌కుమార్‌ ఝా స్పష్టం చేశారు.

సొంతింటి కలను సాకారం చేసుకోవాలి

సిరిసిల్ల, మే 25(ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అందించే సహాయా న్ని పొంది తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని,ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికి ఒక రూపాయి ఇవ్వడానికి వీలు లేదని, ఎక్కడా పైరవీ చేయాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ సందీ ప్‌కుమార్‌ ఝా స్పష్టం చేశారు. ఆదివారం సిరిసిల్లలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో రెండో విడత కింద 764 ఇంది రమ్మ ఇళ్ల ఉత్తర్వు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడాతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పొం దిన వారంతా త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని అన్నారు. ఇంటిస్థలం, భూమిపత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల ఉత్తర్వులు పత్రాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సిరిసిల్లలో 764 మందిని పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి ఉత్తర్వుపత్రాలు పంపిణీ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు నాలుగు దశలలో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందు తుందని, 400చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని స్పష్టం చేశారు. బేస్మెంట్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.లక్ష, గోడలు నిర్మిస్తే రూ.లక్ష స్లాబ్‌ నిర్మించిన తరువాత రూ.2లక్షలు ,ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ లక్ష లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు.

పత్రాలు ఇవ్వడం సంతోషం..

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రతి వారం నిర్వ హించే ప్రజావాణికి ప్రజలు వచ్చి తమకు ఇండ్లు ఇప్పించాలని కోరేవారని కలెక్టర్‌ గుర్తు చేశారు. అలాంటి పేదలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు.

ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ప్రభుత్వం పూర్తి సహకారం అంది స్తుందని, ఇసుక అందుబాటులో పెడతామని కలెక్టర్‌ తెలిపారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక కోసం సంబంధిత వార్డ్‌ ఆఫీసర్లు తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. రవాణా ఛార్జీలు చెల్లించాలని సూచించారు. నిరుపేదలకు పెట్టుబడి లేనిపక్షంలో మెప్మా నుంచి రుణం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సిరిసి ల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ వెలుముల స్వరూపారెడ్డి, హౌ సింగ్‌ పీడీ శంకర్‌, డిఆర్డిఓ శేషాద్రి, మున్సిపల్‌ కమిషనర్‌ వాణి, ఇంది రమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 12:46 AM