కేసీఆర్, కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:56 AM
గతంలో కేటీఆర్ సహకారంతోనే ప్రస్తుతం అపెరల్ పార్క్ సాకారమైందని బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు.

సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : గతంలో కేటీఆర్ సహకారంతోనే ప్రస్తుతం అపెరల్ పార్క్ సాకారమైందని బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు. సిరిసిల్ల పెద్దూరులో అపెరల్ పార్క్లో పంక్చయేట్ వరల్డ్ ప్రైవేటు లిమిటెడ్(టెక్స్పోర్ట్)యూనిట్ ఏర్పాటుకు నాటి ముఖ్యమంత్రి కేసీ ఆర్, మంత్రి కేటీఆర్ కృషితోనే ప్రారంభించుకుంటున్నామని హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం సిరిసిల్ల పట్టణం చేనేత చౌక్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీ ఆర్ చిత్రపటానికి నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు ఎండీ సత్తార్, మహిళ పట్టణ అధ్యక్షురాలు బత్తుల వనజ, సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్పర్సన్ రాపెల్లి లక్ష్మీనారా యణ, వైస్చైర్మన్ ఆడగట్ల మురళి, జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ ఆకునూరి బాలరాజు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సబ్బని హరీష్, యూత్ పట్టణ అ ధ్యక్షుడు సుంకపాక మనోజ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.