Karimnagar: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి..
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:49 AM
రామడుగు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
రామడుగు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మండలంలోని దేశరాజుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. అన్ని తరగతి గదులను పరిశీలించారు. ఏడో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. పాఠశాలలోని అన్ని గదులను వినియోగంలోకి తీసుకురావాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అంగన్వాడి కేంద్రం చిన్న గదిలో నిర్వహిస్తుండడంతో పాఠశాలలో ఖాళీగా ఉన్న విశాలమైన గదికి తక్షణమే మార్చాలని ఆదేశించారు. విద్యార్థులు తప్పనిసరిగా యూనిఫాం, షూ ధరించేలా చూడాలని, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో రాజేశ్వరి ఉన్నారు.
ఫ దేశరాజుపల్లిలోని పల్లె దవాఖానాన్లు కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకుంటున్న వృద్దులతో మాట్లాడి పల్లె దవాఖానా సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ర్టేషన్లు, ఆరోగ్య మహిళ వైద్య పరీక్షల రిజిస్టర్ను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సన ఉన్నారు.