Share News

ఫోర్టిఫైడ్‌ బియ్యంతో ఆరోగ్యం

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:16 AM

పౌరసరఫరాల శాఖ రెండేళ్లుగా ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తోంది. అవగాహన లేక కొందరు లబ్ధిదారులు ఫోర్టిఫైడ్‌ రేషన్‌ సన్న బియ్యాన్ని నల్ల బజారులో విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆహార భధ్రత నుంచి పోషకాహార భద్రత కల్పించాలన్న ప్రభుత్వం లక్ష్యం నీరుగారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి జిల్లాలోని రేషన్‌షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది.

ఫోర్టిఫైడ్‌ బియ్యంతో ఆరోగ్యం

-రేషన్‌బియ్యంలో పోషకాలు

-ఆహారంగా తీసుకుంటే పెరగనున్న రోగనిరోధక శక్తి

-రక్తహీనత అధిగమించవచ్చని వైద్యుల సూచన

జగిత్యాల, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల శాఖ రెండేళ్లుగా ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తోంది. అవగాహన లేక కొందరు లబ్ధిదారులు ఫోర్టిఫైడ్‌ రేషన్‌ సన్న బియ్యాన్ని నల్ల బజారులో విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆహార భధ్రత నుంచి పోషకాహార భద్రత కల్పించాలన్న ప్రభుత్వం లక్ష్యం నీరుగారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి జిల్లాలోని రేషన్‌షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. అయితే ఇందులో ప్రతి నెలా 5 నుంచి 10 శాతం రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులు ఫోర్టిఫైడ్‌ రైస్‌పై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జాతీయ పోషకాహార సంస్థ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

ఫఅపోహలు వద్దు..

చిన్నారులు, యువకులు, గర్భిణుల్లో 35 నుంచి 50 శాతం రక్తహీనత ఉన్నట్లు జాతీయ కుటుంబ సర్వే నివేదిక పేర్కొంది. ఎలాంటి అపోహలు లేకుండా ఫోర్ట్‌ఫైడ్‌ రైస్‌ను ఆహారంగా తీసుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పురుషులు తీసుకునే మొత్తం ఆహారంలో ఐరన్‌ వరుసగా 13 మిల్లీగ్రాముల నుంచి 15, 19 మిల్లీగ్రాములు ఉంటుందని అంటున్నారు.

ఫపోషకాలు ఎంతమేర కలుపుతారంటే..

ఒక బ్యాగుకు 28 నుంచి 42.5 మిల్లీగ్రాముల వరకు ఐరన్‌ (ఫెర్రిక్‌ ఫైరోపాస్పేట్‌) కలుపుతారు. దీనికి బదులు సోడియం ఐరన్‌ 14 నుంచి 25.25 మిల్లి గ్రాములు కలుపుతారు. ఒక బ్యాగుకు 75 నుంచి 125 మిల్లీగ్రాముల వరకు ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బీ-12 కోసం హైడ్రాక్సైకో బలమైన పోషకాలు, జింక్‌, విటమిన్‌ ఏ, థయమిన్‌, రైబోప్లావిన్‌, నియాసిన్‌, విటమిన్‌ బీ6, పోషకాలు కలుపుతారు. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళల్లో రక్తహీనత సమస్య ఉండదు. చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందుకోసమే బియ్యాన్ని హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకాల్లో వినియోగిస్తున్నారు.

బియ్యాన్ని వినియోగించాలి

-జితేందర్‌రెడ్డి, జిల్లా సివిల్‌ సప్లయిస్‌ అధికారి

రేషన్‌ దుకాణాల్లో పంపిణీ జరుగుతున్న ఫోర్టిఫైడ్‌ కెర్నెల్స్‌ బియ్యాన్ని లబ్ధిదారులు ఆహారంగా తీసుకోవాలి. దుకాణాల్లో తీసుకున్న బియ్యాన్ని ఇతరులకు విక్రయించకుండా ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారు. రక్తహీనతను అధిగమించవచ్చు. చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రేషన్‌బియ్యాన్ని వినియోగించాలి.

జిల్లాలో రేషన్‌ వివరాలు ఇలా..

----------------------------------------------------

రేషన్‌ దుకాణాల సంఖ్య...592

ఆహార భద్రతాకార్డుల సంఖ్య...2,17,665

యూనిట్ల సంఖ్య...6,16,557

ఏఎఫ్‌సీ కార్డుల సంఖ్య....14,587

యూనిట్ల సంఖ్య...35,667

అన్నపూర్ణ కార్డుల సంఖ్య...125

యూనిట్ల సంఖ్య...144

మొత్తం కార్డుల సంఖ్య...3,47,546

యూనిట్ల సంఖ్య...10,13,901

Updated Date - Nov 08 , 2025 | 01:16 AM