బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:56 PM
బాధితుల సమస్యల పరిష్కా రమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్య క్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.
సిరిసిల్ల క్రైం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : బాధితుల సమస్యల పరిష్కా రమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్య క్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. సోమవారం నిర్వ హించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజాసమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యా దపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేవిధంగా చూడా లన్నారు. అప్పుడే ఫిర్యాదుదారుడికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగు తుందన్నారు. గ్రీవెన్స్డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందిస్తామన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరు గా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామన్నారు.