ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
ABN , Publish Date - May 10 , 2025 | 12:28 AM
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోనరావుపేటలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

కోనరావుపేట, మే 9 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోనరావుపేటలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్దవుతుందని అన్నారు. అందుకే కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గొట్టే రామచంద్రం, మాజీ జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, వైస్ఎంపీపీ తీగల రవీందర్గౌడ్, మాజీ సర్పంచ్ అనుపాటి బాపురెడ్డి, జిన్నా అనిల్, బైరగోని సురేష్ గౌడ్, శంకర్, తిరుపతి, జితేందర్రెడ్డి, శ్రీనివాస్, మల్లేశం, విజయ్, శ్రీను, సుమన్, లక్ష్మారెడ్డి, దామో దర్ రెడ్డి, తీగల జయశ్రీ, విజయ్, రాజు, సాయి పాల్గొన్నారు.