ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:10 AM
మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల రూరల్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో బీజేపీ కరీంనగర్ పార్లమెంటరీ కో-కన్వీనర్ అడెపు రవీందర్, పట్టణ అధ్య క్షుడు దుమాల శ్రీకాంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మ్యాన రాంప్రసాద్, గుడురి బాస్కర్, మేర్గు శ్రీనివాస్, కొండ నరేష్, మోర శ్రీహరి, అంకారపు రాజు, కాంబోజు శ్రీధర్, దేవరాజు, మోర రవి, రమేష్చారి, తాటిపాముల సత్యం, పోశేట్టి, దేవేందర్రెడ్డి, ప్రతాప్, వోడ్నాల శేఖర్, మొగిలి రాజు, గాలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.