Share News

ప్రజా సమస్యలపై పోరాడండి..

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:59 AM

ప్రజాక్షేత్రంలోకి నాయకులు వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన సమయం ఇదని.. ఎక్కడికి అక్కడ తమ పరిధిలో ఉన్న సమస్యలపై పోరాటం చేయాలని బీఆర్‌ ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలపై పోరాడండి..

సిరిసిల్ల ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజాక్షేత్రంలోకి నాయకులు వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన సమయం ఇదని.. ఎక్కడికి అక్కడ తమ పరిధిలో ఉన్న సమస్యలపై పోరాటం చేయాలని బీఆర్‌ ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మ నాయక కళ్యాణ మండపంలో సిరిసిల్ల బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు, బూత్‌ కమిటీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు సిరిసిల్లలో తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ చెందిన మాజీ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్య చేసుకోగా, ఆయన కూతురు లక్షిత వివాహాన్ని తానే స్వయంగా జరిపించి ఆశీర్వదించారు. అనంతరం సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ పల్లెల్లో వీధి దీపాలు వెలగడం లేదని, శానిటేషన్‌ జరగడం లేదని, ఇతర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. గత పదేండ్ల కాలంలో సిరిసిల్ల మానేరు మండుటెండల్లో నిండుగ పారేది, కాంగ్రెస్‌ వచ్చాక ఎడారిలా మార్చారని అన్నారు. యూరియా కొరతతో కాంగ్రెస్‌ నాయకులకు గ్రామాల్లో తిరిగే ముఖం లేకుండా పోయిందని. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి మైకు పడితే హామీల అమలుపై మాట్లాడమంటే, బూతులు మాత్రమే మాట్లాడుతున్నాడని అన్నారు. 42 శాతం కాంట్రా క్టు పనులు బీసీలకు ఇస్తామని, బీసీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామని అది కూడా చేయలేదన్నారు. సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు విద్యుత్‌ బిల్లుల సబ్సిడీ ద్వారా చెల్లించాలని ప్రభుత్వంపైన ఒత్తిడి చేయాలని అన్నారు. రాబోవు ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలని, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు అన్నింటిలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తుందని అన్నారు. గ్రామా లు, మండలాల వారీగా ఇన్‌చార్జిలను నియమిస్తామని ప్రజల వద్దకు వెళ్లాని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను వీడియోలుగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టులు చేయాలని అన్నారు. ‘అసెం బ్లీ ఎన్నికల సమయంలో మీరంతా నాకోసం పని చేశారని, రాబోవు మున్సిపల్‌ ఎన్నికలలో మీ విజయం కోసం పనిచేస్తాను’ అని అన్నారు. మన హయాంలో పదేళ్లపాటు అందరికీ మంచి చేశాం తప్ప, ఎవరికి చెడు చేసే అలవాటు మనకు లేదు... ఎవరైనా మన జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే పోలీసు కేసులు పెట్టడం, జైలుకు పంపడం అనే విధంగా మారిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో సాయి రెడ్డి అనే వ్యక్తి ఇంటి ముందు గోడ కట్టి అతడు ఆత్మహత్య చేసుకునే వరకు పరిస్థితి ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. కరోనా విపత్కర పరి స్థితుల్లోనూ ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా అమలు చేశామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని అన్నారు. పార్లమెంట్‌ వేదికగా కేంద్ర ప్రభు త్వం కేసీఆర్‌ పాలనలో రూ 2 లక్షల కోట్లు అప్పు మాత్రమే చేసిందని ప్రకటించిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం రూ.8 లక్షల కోట్లు అప్పు లు చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజా క్షేత్రంలో ఇప్పటికీ కేసీఆర్‌ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నా రని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కేసీఆర్‌కు మళ్లీ ఓటు వేసేం దుకు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో నాస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు,సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, బీఆర్‌ ఎస్‌ జిల్లా ఆధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ ఆధ్యక్షుడు జిందం చక్ర పాణి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమా, గ్రంఽఽథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ రాపెల్లి లక్ష్మీనారా యణ, వైస్‌చైర్మన్‌ మురళి, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ మంచె శ్రీని వాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు బొల్లి రాంమోహన్‌, ధార్న లక్ష్మీనారాయణ, మ్యాన రవి, సత్తార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 12:59 AM