Share News

ఈవీఎం గోదాం తనిఖీ

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:44 AM

కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌ బుధవారం తనిఖీ చేశారు.

 ఈవీఎం గోదాం తనిఖీ
ఈవీఎం గోదాంను తనిఖీ చేస్తున్న అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌

కరీంనగర్‌, జులై 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికం సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్‌ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నామన్నారు. ఈవీఎంల భద్రతకు సంబంధిచిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె మహేశ్వర్‌, కాంగ్రెస్‌ ప్రతినిధి మడుపు మోహన్‌, బబీఆర్‌ఎస్‌ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్‌, బీజేపీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్‌, ఎంఐఎం బర్కత్‌ అలీ, టీడీపీ కళ్యాడపు ఆగయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:44 AM