‘రాజీవ్ యువ వికాసం’లో అర్హులను ఎంపిక చేయాలి
ABN , Publish Date - May 16 , 2025 | 12:08 AM
జిల్లాలో పారదర్శ కంగా రాజీవ్ యువవికాసంలో నిరుపేద యువ లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అధికారులను అదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, మే 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పారదర్శ కంగా రాజీవ్ యువవికాసంలో నిరుపేద యువ లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అధికారులను అదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం రాజీవ్ యువ వికా సం లబ్ధిదారుల ఎంపికపై ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రాజీవ్ యువ వికాసం కింద 36,819 దరఖా స్తులు వచ్చాయని, వీటిని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి 30,627 దరఖాస్తులను బ్యాంకు లకు పంపించామన్నారు. 6,192 దరఖాస్తులను వివిధ కారణాల తో తిరస్కరించామన్నారు. బ్యాంకులు 30,627 దరఖాస్తుదారుల బ్యాక్గ్రౌండ్, స్కూటీని పూ ర్తిచేశాయని తెలిపారు. గంభీరావుపేట మండలంలో దళారులు యువ వికాసం పథకం కింద యూనిట్ ఇప్పిస్తామని ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచా రం అందుతుందని, పారదర్శకంగా యువ వికాసం యూనిట్ల ఎంపిక జరుగుతుందని, ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పార దర్శకంగా జరిగిందని, అదేవిధంగా ప్రభుత్వ నియమ నిబంధనల ను పాటిస్తూ నిరుపేదలకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తూ పారద ర్శకంగా వికాసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధి కారులను ఆదేశించారు. దళారుల ఒత్తిడి లేకుండా పేదలకు మాత్రమే పథకం అందాలని, ఎక్కడైనా అనర్హులకు చేరితే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలను మోసగిస్తున్న దళారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో శేషాద్రి, ఎల్డీఎం మల్లికార్జున్రావు, మైనార్టీ వెల్ఫేర్ అధికారి ఎంఏ భారతి, బీసీ వెల్ఫేర్ అధికారి రాజమనోహర్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.