నిష్పక్షపాతంగా ఎన్నికలు విధులు నిర్వర్తించాలి
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:43 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధి కారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హరిత ఆదే శించారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో అధి కారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హరిత ఆదే శించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్డ్(ఎంసీసీ)పై వివిధ శాఖల జిల్లా అధికారు లు, ఎంపీడీవోలు, ఎంపీవోలకు మంగళవారం కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొనకూడ దని స్పష్టం చేశారు. విధుల్లో భాగంగా ఎఫ్ఎస్, ఎస్ఏసీలు సీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా వీడియో ఫుటేజ్ తీసుకోవాలని, ఏమాత్రం నిర్లక్షం ప్రదర్శించవద్దని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత రూ.50వేల కంటే ఎక్కువ డబ్బు తరలిస్తే పట్టు కొని, వీడియో తీసి పంచనామా చేయాలని, అనంతరం పట్టుకున్న డబ్బుకు సంబంధించి రసీదు అందజేయాలని సూచించారు. ఎన్నిక ల ప్రచారం, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం, వాటిని పరిశీలించడంపై వివరించారు. ఆయా మండలాల నోడల్ ఆఫీసర్లు తమ నివేదికను ప్రతి రోజు పంపించాల్సి ఉంటుందని తెలిపారు. ఎంసీసీ నోడల్ ఆఫీ సర్గా డీఆర్డీవో శేషాద్రి నియమించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఉంటాయ ని తెలిపారు. ఈ సమావేశంలో వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ షర్ఫుద్దీన్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.