Share News

రుణాల పంపిణీ లక్ష్య సాధనకు కృషి

ABN , Publish Date - May 10 , 2025 | 12:30 AM

ఎస్‌హెచ్‌జీల కు బ్యాంక్‌ లింకేజీ రుణాల పంపిణీలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ బాధ్యులను కలె క్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అభినందించారు.

రుణాల పంపిణీ లక్ష్య సాధనకు కృషి

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ఎస్‌హెచ్‌జీల కు బ్యాంక్‌ లింకేజీ రుణాల పంపిణీలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ బాధ్యులను కలె క్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అభినందించారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి లక్ష్య సాధ నలో భాగంగా ఎస్‌హెచ్‌జీలకు బ్యాంక్‌ లింకేజీ రుణాలు ఇప్పించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బందిని సమీకృత కార్యాలయాల సముదా యంలో శుక్రవారం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అభినం దించారు. అన్ని విభాగాల్లో ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్‌ సం దీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ బ్యాంకు లింకేజి ద్వారా స్వశక్తి సంఘ సభ్యులకు రుణాలు ఇప్పించడంతో వారు ఆర్థికంగా ఎదుగుతున్నారని వివరించారు. జిల్లాలో బ్యాంకు లింకేజీ 2024-25 సంవత్సరానికి లక్ష్యం 7969 సంఘాలకు రూ. 533.73 కోట్లు కాగా 4376 సంఘాలకు రూ.542.30 కోట్లతో 102 శాతం ప్రగతి సాధించి నందున, అలాగే ఫర్‌ గ్రూప్‌ ఫైనాన్స్‌ రూ.12.48లక్షలు ఇవ్వటంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండటంతో రాష్ట్రస్థాయిలో జిల్లాకు అవార్డు వచ్చిందని తెలిపారు. పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ లోకేష్‌ కుమార్‌, సెర్ఫ్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ నుంచి డీఆర్‌డీవో, అదనపు డిఆర్‌డీవో, డీపీఎం తదితరులు జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్‌ సరిత స్వీకరించారని తెలిపారు. మహిళా సంఘాల బాధ్యులు జిల్లాలో బ్యాంకు లింకేజీ ద్వారా రుణం తీసుకుని నూనెమిల్లులు, బిర్యాని పాయింట్స్‌, టిఫిన్‌ సెంటర్‌, పచ్చళ్ళు, మిల్లెట్స్‌పిండి, లడ్డు ఇతర పదార్థాలు, కిరాణం దుకాణాలు, బ్యూటీపా ర్లర్లు, సారీసెంటర్‌లు, జిరాక్స్‌ సెంటర్‌లు, క్యాంటీన్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, డెయిరీ ఉత్ప త్తులు, గేదెల పెంపకం వివిధ రకాల ఆధాయాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆర్థిక ప్రగతి సాధిస్తూ ముందుకు సాగుతున్నారని తెలి పారు. పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి కూడా రుణాలు సద్వినియో గం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఇందిరా మహిళా శక్తి లక్ష్యం 2025-26 సంవత్సరం డిసెంబర్‌ లోపు పూర్తిచేసి రాష్ట్రంలో జిల్లాని ప్రథమ స్థానంలో ఉంచాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీ ణ అభివృద్ధి సంస్థ అధికారి శేషాద్రి, అదనపు అధికారి శ్రీనివాస్‌, డీపీ ఎంలు, సీసీలు, జిల్లా సమాఖ్య బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:30 AM