Share News

నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:19 AM

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ఆదేశాలతో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం. హరిత తెలిపారు.

నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

వేములవాడ టౌన్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ఆదేశాలతో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం. హరిత తెలిపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వేములవాడ అర్బన్‌, రూరల్‌ నామినేషన్‌ స్వీకరణకు చేసిన ఏర్పా ట్లను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సెప్టెంబరు 29వ తేదిన షెడ్యూల్‌ విడుదల చేశారని వెల్లడించారు. ఇందులో భాగంగా జిల్లా లో మొదటి విడతలో ఏడు జడ్పీటీసీ స్థానాలు, 65 ఎంపిటీసీ స్థానా లకు నామినేషన్‌ స్వీకరిస్తామని తెలిపారు. ఎంపీడీవో కార్యాలయా ల్లో నామినేషన్‌ స్వీకరణకు ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లు, ఇతర ఏర్పాట్లను పరిశీలించామని వివరించారు. ఇప్పటికే ఎన్నికల నేపథ్యం లో ఆర్‌వో, ఏఆర్‌వోలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఎన్నికలకు సం బంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, జోనల్‌, మండల ఆఫీసర్లు, ఎంసీసీ నోడల్‌ ఆఫీసర్లు, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ టీములను నియమిం చి శిక్షణ పూర్తిచేశామని పేర్కొన్నారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ టీములు విధులు నిర్వర్తిస్తున్నాయని తెలిపారు. అన్ని ఆర్‌వో కార్యాలయాల్లో ఎన్నికల్లో పటీ చేసే అభ్యర్థుల సహాయార్థం హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, ఎన్నికకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటు లో పెట్టాలని, నామినేషన్‌ స్వీకరణ ఇతర వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు జిల్లాలో రెండు, మూడో విడతల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. ఆమె వెంట ఆర్డీవో రాధాభాయి ఎంపిడీవోలు తహసీల్దార్‌లు ఉన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 12:19 AM