Share News

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి దిష్టి బొమ్మల దహనం.

ABN , Publish Date - Mar 17 , 2025 | 01:03 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటాఆర్‌, జగదీశ్‌రెడ్డి దిష్టి బొమ్మలను కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా చౌక్‌ వద్ద ఆదివారం దహనం చేశారు.

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి దిష్టి బొమ్మల దహనం.
దిష్టిబొమ్మలు దహనం చేస్తున్న నాయకులు

కరీంనగర్‌ అర్బన్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటాఆర్‌, జగదీశ్‌రెడ్డి దిష్టి బొమ్మలను కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా చౌక్‌ వద్ద ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంటగలిపారని విమర్శించారు. గతంలో ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను అసెంబ్లీ నుంచి బర్తరఫ్‌ చేశారన్నారు. లోక్‌సభ స్పీకర్‌గా తెలంగాణ బిల్లు పాస్‌ చేసిన మీరా కుమార్‌ తెలంగాణకు వచ్చి కేసీఆర్‌ అపాయింట్మెంట్‌ అడిగితే ఇవ్వలేదని విమర్శించారు. ఆనాడు సిరిసిల్ల నియోజక వర్గం నేరెళ్ల గ్రామ దళిత కుటుంబానికి చెందిన వారు ఇసుక లారీల టైర్ల కింద పడి మరణిస్తే ఆ కుటుంబాలను పరామర్శించడానికి మీరాకుమార్‌ నేరెళ్లకు వెళితే అరెస్ట్‌ చేశారని అన్నారు. అనేక రకాలుగా దళితులపై బీఆర్‌ఎస్‌ నాయకులు అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా వారి దిష్టి బొమ్మలు దహనం చేశామని తెలిపారు. ఇప్పటికయినా పద్దతి మార్చుకోకపోతే బీఆర్‌ఎస్‌ నాయకులను తరిమికొట్టే రోజు వస్తుందని నరేందర్‌రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తుమల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్‌ కుమార్‌, నాయకులు గుండాటి శ్రీనివాస్‌ రెడ్డి, ఆకారపు ఆకారపు భాస్కర్‌రెడ్డి, కర్ర రాజశేఖర్‌, గడ్డం విలాస్‌రెడ్డి, సమద్‌ నవాబ్‌, దండి రవీందర్‌, గంట శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 01:03 AM