భూ భారతి అర్జీలు త్వరగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:58 PM
భూ భారతిలో వచ్చిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిర ణ్ అన్నారు.
గంగాధర, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): భూ భారతిలో వచ్చిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిర ణ్ అన్నారు. సోమవారం గంగాధర తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మీక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలు ఎన్ని, ఎన్నింటిని పరిష్కరించారు, పెండింగ్లో ఉన్న అర్జీలు ఎన్ని అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు సమస్యలపై సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. విచారణ జరిపి అవసరమైతే నోటీసులు జారీ చేసి వాంగ్మూలాలను తీసుకుని న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని అన్నారు. అనంతరం ఎన్నికల కోడ్ అమలుపై సూచనలు చేశారు. ఆమె వెంట కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్ రజిత, ఆర్ఐలు, సిబ్బంది ఉన్నారు.