మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:38 AM
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యులను ఆదేశించారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ, ఐసీయూ, మెటర్నిటీ, ఆర్థోపెడిక్, మేల్ వార్డుల్లో అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆనంతరం పలువురు రోగులు ఎలాంటి అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వచ్చారని, ఇక్కడ సేవలు ఎలా అందుతున్నాయో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజ నల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి రోగికి ఉత్తమ సేవలు అందిం చాలని సూచించారు. తంగళ్ళపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో ఫీవ ర్ సర్వే చేయాలని జిల్లా వైద్యాధికారి రజితను ఆదేశించారు.