ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ నాయకుల నిరసన
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:19 AM
పంచాయతీ ఎన్నికలు పార్టీపరంగా రిజర్వేషన్లతో జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘం నేతలు శుక్రవారం నిరసన తెలిపారు.
వేములవాడ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు పార్టీపరంగా రిజర్వేషన్లతో జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘం నేతలు శుక్రవారం నిరసన తెలిపారు. వేములవాడ పట్టణంలోని బీసీ సంఘం కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలను ధరించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబాపూలే చిత్రపటాలకు వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లను ఉపసంహరించుకోవాలని, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, శాస్త్రీయంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికారత ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పొలాస నరేందర్, బీసీ సంఘం నేతలు నేరేళ్ల తిరుమల్ గౌడ్, తుపుకారి సత్తయ్య, వెంకటేష్, కడారి రాములు, చింతలకోటి రామస్వామి, మారం కుమార్, దేవయ్య, భూమయ్య, దశగౌడ్, చంద్రకాంత్, రమణ తదితరులు ఉన్నారు.