ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:49 PM
వరి ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అదన పు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
వరి ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అదన పు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులు, ఐకేపీ, పీఏసీ ఎస్, మెప్మా, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సన్నాహ క సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా షామియానా, తాగు నీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రా లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేశారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకుని కేంద్రాలకు తరలించాలని సూచించారు. అవ సరమైన గన్ని బ్యాగులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ 2389, కామన్ రకానికి రూ 2389 నిర్ణయించిదని వెల్లడించారు. ధాన్యం సేకరణలో కొనుగోలు కేం ద్రాల నిర్వాహకులు కీలకమని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగా వసతులు కల్పించాలని సూచించారు. కొను గోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారిం చిన ధాన్యానికి టోకెన్లు జారీచేసి, రైతుల నుంచి సేకరించాలని ఆదేశిం చారు. కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలో రైతుల భూమి సర్వే నంబర్, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ధాన్యం తరలింపు, దించుకోవడంలో ముందస్తుగా వసతులు కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రారంభం
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 13 మండలాల్లో ధాన్యం కొను గోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిలాలో ఈ సీజన్లో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని వెల్ల డించారు. ధాన్యాన్ని సేకరించేందుకు 231 కేంద్రాలు ఏర్పాటు చేస్తామ ని, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 79కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 144, వివిధ శాఖల ఆధ్వర్యంలో 12కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా లో అవసరం అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. టార్పా లిన్లు, తూకం వేసే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, తేమ శాతం చూసే మె షిన్లు డిజిటల్ కాలిపర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు వీటి ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ చంద్రప్రకాష్, జిల్లా మేనేజర్ రజిత డీఏవో అఫ్జల్బేగం, డీఆర్డీవో శేషాద్రి, డీసీవో రామకృష్ణ, డీఎంవో ప్రకా ష్, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.