Share News

అవినీతి రహిత సమాజమే మనందరి లక్ష్యం

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:01 AM

అవినీతి రహిత సమాజం మనందరి లక్ష్యమని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు.

అవినీతి రహిత సమాజమే మనందరి లక్ష్యం

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అవినీతి రహిత సమాజం మనందరి లక్ష్యమని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినీతి వ్యతిరేక దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అవినీతిని నిరోధిస్తామని అధికారులు, ఉద్యోగులు కలెక్టర్‌తో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... అవినీతి నిర్మూలనలో విద్యార్థులు, యువత పాత్ర చాలా కీలకమన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1064 టోల్‌ ప్రీ నంబర్‌కు సమాచారం అందించాలని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తమ కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, ఏసీబీ డీఎస్పీ విజయ్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ కృష్ణకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 12:01 AM