Share News

Employees: సమస్యలపై 2న చర్చిద్దాం.. రండి!

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:15 AM

ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణపై ప్రభుత్వం స్పందించిందని జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌రావు తెలిపారు.

Employees: సమస్యలపై 2న చర్చిద్దాం.. రండి!

  • ఉద్యోగుల జేఏసీకి సర్కారు పిలుపు

  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమైన జేఏసీ నేతలు

  • చర్చల తర్వాత ప్రభుత్వ స్పందనను బట్టి తమ కార్యాచరణ ఉంటుందని వెల్లడి

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణపై ప్రభుత్వం స్పందించిందని జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌రావు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై చర్చించేందుకు సెప్టెంబరు 2న రావాలంటూ ప్రభుత్వం ఆహ్వానం పంపిందని చెప్పారు. గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో భేటీ అనంతరం ఈ మేరకు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సెప్టెంబరు 2న ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ చర్చల తర్వాత ప్రభుత్వం చేసే ప్రకటనను అనుసరించి, తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామని జేఏసీ నేతలు తెలిపారు.

Updated Date - Aug 29 , 2025 | 04:15 AM